‘సనాతన ధర్మం’ ఇష్యూపై స్పందించిన మోడీ.. కేంద్రమంత్రులకు ప్రధాని కీలక సూచన..!

by Disha Web Desk 19 |
‘సనాతన ధర్మం’ ఇష్యూపై స్పందించిన మోడీ.. కేంద్రమంత్రులకు ప్రధాని కీలక సూచన..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దీటుగా సమాధానం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యలపై తొలిసారి రియాక్ట్ అయిన మోడీ సనాతన ధర్మంపై సరైన రీతిలో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రులకు సూచించారు. చరిత్ర లోతుపాతుల్లోకి వెళ్లకుండా రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ధీటుగా బదులివ్వాలని సూచించారు. అలాగే ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని.. ఈ విషయంలో అధికార ప్రతినిధులు మాత్రమే స్పందించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Next Story