నేపాల్‌ భూకంపంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం

by Disha Web Desk 12 |
నేపాల్‌ భూకంపంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ దేశాన్ని మరోసారి భారీ భూకంపం అతలాకుతలం చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం యొక్క కేంద్రం 10 కి.మీ లోతులో ఉంది. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 128 మంది ప్రాణాలను బలిగొంది. కాగా మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. అలాగే శిథిలాల కింద పడి 141 గాయపడగా ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతూనే ఉంది. అయితే ఈ భారీ భూకంపం పై భారత ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నేపాల్‌కు మద్దతును అందించడమే కాకుండా.. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ భూకంపం కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా భూకంప ప్రకంపనలు కనిపించాయి.


Next Story