- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మణిపూర్లో రాష్ట్రపతి పాలన

- గవర్నర్ నివేదికతో ద్రౌపది ముర్మను నిర్ణయం
- వెల్లడించిన హోం మంత్రిత్వ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో శాసన సభను సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల మధ్య ఘర్షణతో కొన్నాళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్కు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర సమాచారాన్ని పరిశీలించిన అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితమే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణల కారణంగా హింస చెలరేగి 21 నెలలు గడిచిపోయింది. ఈ హింసాకాండాలో 250 మంది మృతి చెందగా, వేలాది గృహాలను కాల్చివేశారు. కాగా, ఫిబ్రవరి 9న సీఎం బీరేన్ సింగ్ తన రాజీనామాను అజయ్ కుమార్ భుల్లాకు సమర్పించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందే రాజీనామా చేయడంతో సమావేశాలను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో హింస చెలరేగడానికి కారణం తానేనంటూ బీరేన్ సింగ్ మాట్లాడిన ఆడియో టేపులు లీకయ్యాయి. వీటిని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఐదు రోజుల్లోనే బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులతో ఇంచార్జి సంబిత్ పాత్ర చర్చలు జరిపినా.. సీఎం అభ్యర్థిపై స్పష్టత రాలేదు. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతోనే కేంద్రం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది.