శిబు సోరెన్‌ను పరామర్శించిన రాష్ట్రపతి ముర్ము

by Kema Shiva Kumar |

ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ (81)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరామర్శించారు.

శిబు సోరెన్‌ను పరామర్శించిన రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ (81)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరామర్శించారు. ఈ మేరకు ఆమె ఇవాళ మధ్యాహ్నం ఆమె జంషెడ్‌పూర్‌లోని సర్ గంగా‌రామ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శిబు సోరెన్ కుమారుడు సీఎం హేమంత్ సోరెన్‌ (Hemanth Soren)ను కలిసి ఆయన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, శిబు సోరెన్ వయసు మీద పటడంతో తీవ్ర అనారోగ్యం కారణంగా గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 18, 2015 నుంచి జూలై 13, 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పని చేశారు. దీంతో పరిచయాలతో ఇవాళ ఆమె శిబు సోరెన్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు.

Next Story