కాన్వాయ్ ఆపి చిన్నారులకు చాక్లెట్లు.. కేరళ పర్యటనలో రాష్ట్రపతి

by Disha Web Desk 17 |
కాన్వాయ్ ఆపి చిన్నారులకు చాక్లెట్లు.. కేరళ పర్యటనలో రాష్ట్రపతి
X

తిరువనంతపురం: భారత రాష్ట్రపతి కేరళ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాష్ట్రంలో పర్యటనలో తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆపి స్కూల్ పిల్లలను పలకరించారు. వారికి స్వయంగా చాక్లెట్లు అందజేసి ఆశ్చర్యపరిచాయి. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రపతి ముర్ము కాన్వాయ్ ను ఆపేసి పిల్లల వైపు వెళ్తుండగా, వారి ముఖంలో సంతోషం రెట్టింపైంది. వారికి చాక్లెట్లు అందజేసి కొన్ని నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లారు. ఈ సందర్భంగా పిల్లలు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పారు.


Next Story