మంత్రి కార్యక్రమంలో కరెంట్ కట్.. ఐదుగురు సీనియర్ అధికారుల సస్పెన్షన్

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర మంత్రి ఏ.కె. శర్మ. కానీ పెద్ద ఎత్తున జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో కరెంట్ కట్ అయింది. విద్యుత్ శాఖలో నిర్లక్ష్యానికి ఉదాహరణగా మారింది. ఫలితంగా ఐదుగురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోబడ్డాయి.

మంత్రి కార్యక్రమంలో కరెంట్ కట్.. ఐదుగురు సీనియర్ అధికారుల సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర మంత్రి ఏ.కె. శర్మ. కానీ పెద్ద ఎత్తున జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో కరెంట్ కట్ అయింది. విద్యుత్ శాఖలో నిర్లక్ష్యానికి ఉదాహరణగా మారింది. ఫలితంగా ఐదుగురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోబడ్డాయి. చీఫ్ ఇంజనీర్ అరవింద్ సింఘాల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ సునీల్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రిన్స్ గౌతమ్, సబ్ డివిజనల్ ఆఫీసర్ రాణా ప్రతాప్, జూనియర్ ఇంజనీర్ లలిత్ కుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు. విద్యుత్ అంతరాయం ఉన్నత స్థాయి కార్యక్రమంలో జరగడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ ఘటన తర్వాత పూర్వాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ (పివివిఎన్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఈషా దుహాన్ తక్షణ దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం నిర్ధారణ అయినందున.. వారిని తక్షణమే సస్పెండ్ చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. విద్యుత్ సేవలను సరిగ్గా అందించాలనే ఒత్తిడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. కఠినమైన పర్యవేక్షణ, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. ఈ ఘటన రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కొనసాగుతున్న సవాళ్లను, లోపాలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను హైలైట్ చేస్తుంది.

Next Story