- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తమిళనాడు మంత్రి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
చెన్నై: మనీలాండరింగ్ కేసులో తనకు విధించిన 15 రోజుల (జూన్ 28 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ను తిరస్కరించాలని కోరుతూ తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ను ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టేసింది. ఈ కేసులో పోలీసు కస్టడీకి బాలాజీని అప్పగించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి ఇంకా వాదనలు వినాల్సి ఉంది. మరోవైపు మంత్రి వి.సెంథిల్ బాలాజీ ఇప్పటివరకు నిర్వహించిన 2 శాఖలను ఇద్దరు మంత్రులకు స్టాలిన్ చెరొకటి కేటాయించారు.
తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసుకు ఇంధన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించగా.. గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్.ముత్తుసామికి ఎక్సైజ్ శాఖను కూడా కేటాయించారు. బుధవారం తెల్లవారుజామున ఈడీ కస్టడీలో ఉండగా మంత్రి బాలాజీకి ఛాతీనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు చెన్నైలోని ఒమందూరర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు.