PM Narendra Modi: ముస్లింలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌‌పై ఓ రేంజ్‌లో కౌంటర్ ఎటాక్

by Disha Web Desk 1 |
PM Narendra Modi: ముస్లింలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌‌పై ఓ రేంజ్‌లో కౌంటర్ ఎటాక్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందేమి లేదని, యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయంటూ అధికార బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రాచరిక పాలనకు తెర లేపిందని, మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందనే విషయాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలోనే పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ ముస్లింలను ఉద్దేశించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలను వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదని స్పష్టం చేశారు.

జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న నాటి నుంచే విపక్షాలు తమపై ముస్లింల విషయంలో బద్‌నాం చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. కేవలం వారి ఓట్లను దండుకునేందుకు హస్తం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. బీజేపీని ముస్లిం వ్యతిరేకులుగా చిత్రీకరించి కాంగ్రెస్ నేటికీ రాజకీయ పబ్బం గుడుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఇక వారి ఆటలు సాగవని.. ముస్లింలలో కొందరు వాస్తవాలను తెలుసుకుంటున్నారని ప్రధాని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల్లో ఆనందం చూశామని పేర్కొన్నారు. బీజేపీ ఎవరిపై వ్యక్తిగత కక్ష చూపలేదేని.. ఆ విషయం ఆయుష్మాన్ భారత్, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రజలకు తెలిసిందని అన్నారు. ఎన్నటికైనా.. కాంగ్రెస్ అబద్ధాలు బట్టబయలు అవ్వడం ఖాయమని ప్రధాని మోడీ అన్నారు.

Next Story

Most Viewed