భూమిపై బతికున్న అత్యంత వృద్ధ జంతువును కలవనున్న మోడీ

by Gantepaka Srikanth |

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సెషెల్స్ (Seychelles) పర్యటనలో భాగంగా ఒక అరుదైన, ఆసక్తికరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

భూమిపై బతికున్న అత్యంత వృద్ధ జంతువును కలవనున్న మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సెషెల్స్ (Seychelles) పర్యటనలో భాగంగా ఒక అరుదైన, ఆసక్తికరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో ఆయన భూమిపై ప్రస్తుతం బతికి ఉన్న అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన 'జోనాథన్' (Jonathan) అనే తాబేలును కలవనున్నారు. భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ దేశ జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

194 ఏళ్ల గిన్నిస్ రికార్డ్ తాబేలు 'జోనాథన్’

ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న 'జోనాథన్' ఒక ఆల్డబ్రా జెయింట్ (Aldabra Giant) జాతికి చెందిన తాబేలు. దీని వయసు సుమారు 194 ఏళ్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇది సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్లో నివసిస్తోంది. భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవిస్తున్న ల్యాండ్ యానిమల్గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా ప్రధాని మోడీ ఈ తాబేలును సందర్శించనున్నారు.

Next Story