అయోధ్య రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తాం : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

by Disha Web Desk 13 |
అయోధ్య రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తాం : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
X

అయోధ్య: అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. డిసెంబరు-జనవరి 26 మధ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనువుగా ఉన్న ఏదైనా తేదీని సూచించాలని కోరుతూ ప్రధానికి ఆలయ ట్రస్టు తరఫున లేఖను పంపుతామని తెలిపారు. ఇటీవల జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ఆలయం అధికారికంగా ప్రారంభమవుతుందన్నారు.

"ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఆలయ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి.. తేదీల విషయంలో జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. సరైన తేదీ కోసం ఇప్పటివరకు ఏడుగురు జ్యోతిష్యులతో ఆయన చర్చలు జరిపారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని 7 రోజుల పాటు నిర్వహించాలని ట్రస్టు మీటింగ్ లో నిర్ణయించారు" అని చంపత్‌ రాయ్‌ వివరించారు. కాగా, సుప్రీంకోర్టు రామమందిరానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత.. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు.

Also Read..

‘ముస్లిం లీగ్’ పూర్తిగా సెక్యులర్ పార్టీ.. రాహుల్ గాంధీ



Next Story

Most Viewed