భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు, పవర్ ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన ప్రధాని మోడీ, షేక్ హసీనా

by Disha Web Desk 12 |
భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు, పవర్ ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన ప్రధాని మోడీ, షేక్ హసీనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఎల్లప్పుడు మంచి సంబందాలను కలిగిఉంటుంది. ఇందులో బాగంగానే భారత్, బంగ్లాదేశ్‌ దేశాల మధ్య రైలు, పవర్ ప్రాజెక్టులను భారత ప్రధాని మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. సంయుక్తంగా ప్రారంభించారు. దీంతో భారత్ రెండు దేశాల మధ్య సంబంధాలు,. భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భారత్‌ సహకారంతో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మూడు ప్రాజెక్టులలో అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైలు లింక్, ఖుల్నా - మోంగ్లా పోర్ట్ రైలు మార్గం, బంగ్లాదేశ్‌లోని రాంపాల్‌లోని మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్ - II ఉన్నాయి. ఇరు దేశాల మధ్య గత 9 ఏళ్లలో మన అంతర్గత వాణిజ్యం మూడు రెట్లు పెరిగింది.

ఈరోజు అఖౌరా-అగర్తలా రైలు లింక్ ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది బంగ్లాదేశ్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మధ్య మొదటి రైలు లింక్. మైత్రీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లోని రెండవ యూనిట్‌ను ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. పొరుగు దేశం బంగ్లాదేశ్ కోసం 'సబ్కా సాత్ సబ్కా వికాస్' విధానాన్ని భారతదేశం పరిగణించిందని ప్రధాని మోదీ అన్నారు. "బంగ్లాదేశ్‌కు అతిపెద్ద అభివృద్ధి భాగస్వామిగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. గత 9 సంవత్సరాలలో, USD 10 బిలియన్ల సహాయం అందించబడింది. మేము సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. మా ఉమ్మడి ప్రయత్నాలను విజయవంతం చేసినందుకు ప్రధానమంత్రి షేక్ హసీనాకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Next Story