కేబినెట్‌ సమావేశంలో మంత్రులపై మోడీ సీరియస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-11 12:27:59  IST  )

ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

కేబినెట్‌ సమావేశంలో మంత్రులపై మోడీ సీరియస్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 11ఏళ్ల బీజేపీ పాల‌న‌లో చేసిన మంచి ప‌నుల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని మోడీ మంత్రుల‌కు సూచించారు. త‌మ త‌మ సొంత విజ‌యాల‌ను తెలియ‌జేయాల‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో మోడీ మంత్రుల‌కు క్లాస్ సైతం తీసుకున్నారు.

మంత్రులు త‌మ త‌మ శాఖ‌ల‌పై దృష్టి పెట్టాల‌ని, అదే విధంగా అన‌వ‌స‌ర ప్ర‌క‌ట‌న‌లు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఇక ఈ స‌మావేశంలో బ‌ళ్లారి- చిక‌జాజూరు రైల్వే డ‌బ్లింగ్ ప‌నుల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ నిర్మాణంతో ప‌శ్చిమ తీరంలో ఉన్న మంగళూరు పోర్టుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్‌కు కనెక్టివిటీ లభిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిత్రదుర్గ, బళ్లారి, అనంతపురం మీదుగా లైన్‌ను నిర్మిస్తారు. ఈ రైల్వే లైన్ కోసం రూ.3342 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Next Story