ట్రేడ్ డీల్ తర్వాత.. కింగ్ చార్లెస్‌ను కలిసిన మోడీ

by Phanindra |

యూకేతో భారత్ ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ చేసుకుంది. అనంతరం యూకే కింగ్ చార్లెస్‌ను ప్రధాని మోడీ కలిశారు.

ట్రేడ్ డీల్ తర్వాత.. కింగ్ చార్లెస్‌ను కలిసిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: యూకేతో ఫ్రీట్రేడ్ డీల్ చేసుకున్న అనంతరం సాండ్రిగామ్ ఎస్టేట్‌లో బ్రిటన్ రాజు చార్లెస్‌ను ప్రధాని మోడీ కలిశారు. గురువారం నాడు ప్రధాని మోడీని సాండ్రిగామ్ హౌస్‌లో కింగ్ చార్లెస్ III రిసీవ్ చేసుకున్నారని, ఈ సందర్భంగా బ్రిటన్ రాజుకు ఒక మొక్కను మోడీ అందించారని బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ తెలిపింది. తమ తల్లులకు గుర్తుగా ఒక మొక్క నాటాలంటూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనిలో భాగంగానే కింగ్ చార్లెస్‌కు ఈ మొక్కను అందజేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ‘రాయల్ ఫ్యామిలీ’కి చెందిన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Next Story