మాల్దీవులకు భారత్ బంపర్ ఆఫర్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-25 15:33:07  IST  )

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మాల్దీవులకు(Maldives Tour) వెళ్లిన సంగతి తెలిసిందే.

మాల్దీవులకు భారత్ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మాల్దీవులకు(Maldives Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu)తో కీలక భేటీలో పాల్గొన్న ప్రధాని మోడీ ఆ దేశంతో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 'లైన్ ఆఫ్ క్రెడిట్' అనగా ఆ దేశానికి ఇచ్చే రుణాన్ని రూ.4,850 కోట్లకు పెంచారు. అలాగే భారత్ నుంచి మాల్దీవులకు 72 సైనిక వాహనాలను అందించారు. అద్దు నగరంలో భారీ రోడ్లు, డ్రైనేజి ప్రాజెక్టులను ప్రధాని మోడీ, ముయిజ్జుతో కలిసి ప్రారంభించారు. ఇక ఇండియా-మాల్దీవుల మధ్య ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ పై చర్చలు జరుగుతున్నాయి.

Next Story