ప్రధాని మోడీ ట్రంప్‌కు భయపడుతున్నారు: ఎల్ఓపీ రాహుల్ గాంధీ

by Malleboina Mahesh |

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భయపడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు.

ప్రధాని మోడీ ట్రంప్‌కు భయపడుతున్నారు: ఎల్ఓపీ రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భయపడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాహుల్ మోడీపై కొత్త ఆరోపణలు చేశారు. “ట్రంప్ భారతదేశం రష్యా చమురును కొనుగోలు చేయదని ప్రకటించేంత వరకు మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని రాహుల్ అన్నారు. ట్రంప్ పునరావృతంగా అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ, ప్రధాని ఆయనకు అభినందనలు పంపుతూనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన రద్దు చేయడం, షర్మ్ ఎల్-షేక్ సమావేశాన్ని ప్రధాని దాటవేయడం వంటి పరిణామాలు కూడా మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. అదే సమయంలో, ట్రంప్ చేసిన “ఆపరేషన్ సిందూర్” వ్యాఖ్యలపై కూడా ప్రధాని ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం దేశ గౌరవానికి భంగం కలిగిస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. “దేశ గౌరవం దెబ్బ తింటున్నప్పుడు మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

Next Story