పీఎం మోడీతో పాన్ ఇండియా స్టార్స్ యశ్, రిషబ్ శెట్టి భేటీ

by Dishafeatures2 |
పీఎం మోడీతో పాన్ ఇండియా స్టార్స్ యశ్, రిషబ్ శెట్టి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోడీని అక్కడి సినీ, క్రీడా ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోడీని కలిసినవారిలో కేజీఎఫ్ హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, వెటరన్ క్రికెటర్స్ జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ తో పాటు స్టార్టప్ రంగానికి చెందిన పలువురు ఉన్నారు. సినీ స్టార్స్ తో మాట్లాడిన మోడీ.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ రియల్ హీరో అని మోడీ కొనియాడారు.


దక్షిణాది సినిమాలు దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నాయని, ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో మహిళా నటులకు పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. క్రీడాకారులతో మాట్లాడిన మోడీ.. దేశంలో క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా క్రీడలను విద్యలో భాగంగా చేసి క్రీడాభివృద్ధికి పాటు పడతున్నామని చెప్పారు. స్టార్టప్స్ కు కూడా తాము మద్దతు ఇస్తున్నామని, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పెంపొందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు.



Next Story

Most Viewed