రైతులకు భారీ గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ యోజన సాయం 12,000 వేలకు పెంపు

by Disha Web Desk 12 |
రైతులకు భారీ గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ యోజన సాయం 12,000 వేలకు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతులకు అందించే సహాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ప్రధాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెంపు హామీ ఇచ్చారు. దీంతో PM-కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే పొందుతున్న రైతులు.. ఇక నుంచి 12000 పోందుతారు. ఇది రాజస్థాన్ లోని, దేశంలోని రైతులకు శుభవార్తగా తెలపవచ్చు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, రైతులను మోసం చేసిన వారిని విడిచిపెట్టబోమని, రైతుల నుండి ఎమ్‌ఎస్‌పిపై పంటలను కొనుగోలు చేయాలని రాజస్థాన్ బిజెపి నిర్ణయించిందన్నారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు బోనస్ కూడా ఇస్తామని ప్రధాని మోడీ తెలిపారు. దీంతో పాటుగా ఇంధన ధరలు సమీక్షిస్తామని ప్రధాని మోదీ మరో హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed