రైతులకు PM న్యూఇయర్ గిఫ్ట్.. అకౌంట్లో డబ్బులు పడేది అప్పుడే?

by Dishanational2 |
రైతులకు PM న్యూఇయర్ గిఫ్ట్.. అకౌంట్లో డబ్బులు పడేది అప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించడానికి రెడీ అవుతుంది. నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన పథకం కింద భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏటా ఆరు వేల రుపాయలు ఆర్థిక సాయంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, మూడు సమాన విడుతల కింద రూ.2 వేల చొప్పున పీఎం నరేంద్ర మోదీ అర్హులైన రైతులకు నేరుగా తన ఖాతాలో నగదు జమ చేస్తున్నారు.

ఈ క్రమంలో పీఏం నరేంద్ర మోదీ రైతులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారంట. కొత్త ఏడాదిలో జనవరి నెలలో పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో అన్నదాతలకు కాస్త ఊరట కలగవచ్చును.

Read More...

లిక్కర్ స్కాంలో కవిత ఫిక్స్! 'ఆమ్ ఆద్మీ'తో రూ. 100 కోట్ల డీల్

Next Story

Most Viewed