- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం: నెమలి ఈకలు పీకి, చిత్రహింసలు పెట్టి.. చివరికి ఏం చేశాడంటే?
దిశ, వెబ్డెస్క్: ఎంతో చూడముచ్చటైన జాతీయ పక్షి నెమలిని ఓ దుండగుడు నెమలి ఈకలు పీకి, చిత్ర హింసలు పెడుతూ దారుణంగా చంపిన ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కట్నీలోని రితి పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అతుల్ అనే యువకుడు నెమలిపై ఏమాత్రం కనికరం లేకుండా ఈకలు పీకుతూ పైశాచికానందాన్ని పొందాడు. ఆ సమయంలో అతడి పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. హిందీ సాంగ్స్ ప్లే చేసి, నవ్వుతూ, వీరు కూడా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ.. అదంతా వీడియో తీశారు. దీంతో నెమలి ఆ టార్చర్ తట్టుకోలేక చనిపోయింది.
తాజాగా ఆ వీడియో బయటికి రావడంతో నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో ఫారెస్టు అధికారులకు చేరడంతో అందులో కనిపించిన మోటర్ బైక్ రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా నిందుతుడిని గుర్తించామని జిల్లా డీఎఫ్ఓ శర్మ తెలిపారు. భారతీయ వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972 కింద కేసు నమోదు చేశామని, అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.