పాకిస్తాన్ ప్రధానికి యూఎన్‌లో కౌంటర్ ఇచ్చిన పెటల్ గెహ్లోట్

by Malleboina Mahesh |

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ సైన్యం పోరాటాన్ని నిలిపివేయమని భారత సైన్యాన్ని విజ్ఞప్తి చేసిందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికపై స్పష్టం చేసింది.

పాకిస్తాన్ ప్రధానికి యూఎన్‌లో కౌంటర్ ఇచ్చిన పెటల్ గెహ్లోట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ సైన్యం పోరాటాన్ని నిలిపివేయమని భారత సైన్యాన్ని విజ్ఞప్తి చేసిందని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికపై స్పష్టం చేసింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఏ సమస్యలోనూ మూడవ పక్ష జోక్యానికి అవకాశం లేదని ఈ సందర్భంగా భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్‌లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్-పాక్ యుద్ధాన్ని నివారించడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భారత శాశ్వత మిషన్‌లోని మొదటి కార్యదర్శి పెటల్ గెహ్లోట్ మాట్లాడుతూ, “ఈ అసెంబ్లీ వేదికపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి అసంబద్ధమైన, నాటకీయ ప్రదర్శన మాత్రమే చేశారు. అంతేకాకుండా తమ విదేశాంగ విధానానికి ముఖ్యమైన ఉగ్రవాదాన్ని మరోసారి కీర్తించారు” అని తీవ్రంగా విమర్శించారు. భారతదేశం తరఫున హక్కు ప్రకారం సమాధానం ఇస్తూ గెహ్లోట్, పాకిస్తాన్ విధానంపై అంతర్జాతీయ వేదికపై ఘాటుగా స్పందించడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story