పాకిస్థాన్ విమానం సీజ్.. ఎందుకో తెలిస్తే..

by Disha Web Desk 1 |
పాకిస్థాన్ విమానం సీజ్.. ఎందుకో తెలిస్తే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా దాయాది దేశం పాకిస్థాన్ పరువు గంగలో కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం పేరు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలోని పాకిస్థాన్ కు మలేషియా షాకిచ్చింది..! తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పాక్ జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానాన్ని మలేషియా సీజ్ చేసింది. కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికులను అక్కడే వదిలేసినట్లు ఏ.ఆర్.వై న్యూస్ మంగళవారం నివేదించింది. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు పాక్ పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించవలసి ఉంది. వాస్తవానికి పొరుగు దేశం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ మలేషియా నుంచి బోయింగ్ 777 విమానాన్ని లీజుకు తీసుకుంది. 4 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించని కారణంగా కౌలాలంపూర్ విమానాశ్రయంలో బీఎంహెచ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న విమానాన్ని నిలిపివేశారు. పాకిస్థాన్ కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇది రెండోసారి.

లీజర్ అభ్యర్థన మేరకు విమానాన్ని సీజ్ చేయాలని మలేషియా కోర్టు ఆదేశించడంతో కంపెనీ పాక్ విమానాన్ని సీజ్ చేసినట్లు పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ విమానాన్ని విడిపించేందుకు న్యాయపరమైన పరిష్కారాలను కోరుకుంటున్నామని వెల్లడించారు, ఇప్పటికే చెల్లింపులు జరిపినట్లు తెలపారు. బకాయిల కోసం పాకిస్థాన్ విమానాన్ని సీజ్ చేయడం గత రెండేళ్లలో ఇది రెండోసారి. 2021లో కౌలాలంపూర్ విమానాశ్రయ అధికారులు ఇదే విమానాన్ని సీజ్ చేశారు. అప్పుడు బకాయిల చెల్లింపు గురించి దౌత్యపరమైన హామీతో విమానాన్ని విడుదల చేశారు.

Next Story