పాకిస్థాన్ కే అన్ని విధాలుగా నష్టం.. కాల్పుల విరమణపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

by Ramesh Goud |
పాకిస్థాన్ కే అన్ని విధాలుగా నష్టం.. కాల్పుల విరమణపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న అనంతరం పాక్ డీజీఎంఓ (Pak DGMO) పిలుపు మేరకు రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) చేసుకున్నాయి. దీనిపై భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ (Wing Commander Vyomika Singh) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దాడుల వల్ల పాకిస్థాన్ (Pakistan) చవి చూసిన నష్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె.. ఈ దాడులలో భారత సాయుధ దళాలు కేవలం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ఉగ్రవాద శిబిరాలను (Terrorist Places) మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని, ఎటువంటి మతపరమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే గత కొద్ది రోజులుగా భారతదేశంపై పాకిస్థాన్ చేపడుతున్న కవ్వింపు చర్యల వల్ల ఆ దేశం భరించలేని నష్టాన్ని చవిచూసిందని తెలిపారు. ఇది పాకిస్థాన్ కు నేలపైనే కాదు.. గాలిలో కూడా నష్టాన్నే చేకూర్చిందని, పాక్ వైమానిక స్థావరాలు అయిన స్కార్డు, జకోబాబాద్, భోలారీ లకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.

అంతేగాక అదనంగా.. ఆధునిక ఆయుధ వ్యవస్థతో పాటు రాడార్ ను కోల్పోవడం వల్ల పాకిస్థాన్ కు వైమానిక ప్రాంతాన్ని రక్షించుకోవడం అసాధ్యంగా మారిందని తెలిపారు. ఇక నియంత్రణ రేఖ వెంబడి సైనిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, లాజిస్టిక్ కేంద్రాలకు తీరని నష్టం వాటిల్లిందని, దీనికి తోడు రెండు సైనిక సిబ్బంది రక్షణ వ్యవస్థలు, అవి దాడి చేసే సామర్థ్యాలు పాకిస్థాన్ నైతికతను పూర్తిగా దెబ్బతీశాయని కమాండర్ వ్యోమికా వెల్లడించారు.



Next Story

Most Viewed