- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత డ్రోన్లను కావాలనే కూల్చలేదు..పాక్ డిఫెన్స్ మినిస్టర్ వింత వాదన!

దిశ, నేషనల్ బ్యూరో: ఏ విషయంలోనైనా పిచ్చివాగుడు వాగడానికి పాకిస్తాన్ మంత్రులు, నేతలు ముందుంటారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మీడియాలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ పార్ వెర్రితనాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. మరోసారి వింత వాదనతో నవ్వులపాలయ్యాడు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో (మన పార్లమెంట్ వంటిది) భారత్ చేసిన దాడి గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. భారత్ పంపిన డ్రోన్లు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఒక రాడార్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇంతలా పాక్ రక్షణ వ్యవస్థ ఎలా ఫెయిలవుతుందని ఖవాజాను పాక్ నేతలు నిలదీశారు.
వింత వాదన..
ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఖవాజా వింత వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ‘భారత్ చేసిన డ్రోన్ దాడి మన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసమే. ఈ లొకేషన్ వివరాలు భారత్కు తెలియకూడదనే ఆ డ్రోన్లను మేం కూల్చలేదు. ఇదంతా గొప్ప సాంకేతిక విషయం. దీన్ని ఇంతకన్నా స్పష్టంగా వివరించడం నా వల్ల కాదు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వాదన విన్న వారంతా పాక్ డిఫెన్స్ మినిస్టర్కు మతిపోయిందా? అంటున్నారు. కనీసం డ్రోన్లను కొట్టలేని రక్షణ వ్యవస్థ ఉంటే ఎంత? పోతే ఎంత? అని పాక్ ప్రజలు కూడా తిట్టిపోస్తున్నారు.