- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Pak shelling: ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ షెల్లింగ్.. ఓ అధికారి సహా నలుగురు మృతి !

దిశ, నేషనల్ బ్యూరో: నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్థాన్ (Pakisthan) మరోసారి కాల్పులకు తెగపడింది. శనివారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతం సమీపంలో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో రాజౌరీ అడిషనల్ డిస్ట్రిక్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తాపా సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బిహార్కు చెందిన రెండేళ్ల ఆయిషా నూర్, మొహమ్మద్ షోహిబ్ (35) మరొక వ్యక్తి ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే పూంచ్లోని మెంధార్లో జరిగిన ఫైరింగ్లో రషీదా బీ (62) అనే మహిళ మరణించింది. దీంతో మంగళవారం నుంచి ఎల్ఓసీ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 19కి చేరుకుంది.
అంతేగాక ఉరి, గురేజ్ సెక్టార్టలోనూ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లోని చరుందా, హట్లంగా ప్రాంతాలను పాక్ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దాదాపు 15 గ్రామాలపై షెల్లింగ్ నిర్వహించారు. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ చాలా ఇండ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దీంతో పాక్ చర్యలతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పాక్ దుశ్చర్యలకు భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నట్టు అధికారులు తెలిపారు.