‘మెగాస్టార్‌’కు ‘పద్మ విభూషణ్’.. వెంకయ్యనాయుడికి సైతం..

by Dishanational5 |
‘మెగాస్టార్‌’కు ‘పద్మ విభూషణ్’.. వెంకయ్యనాయుడికి సైతం..
X

దిశ, నేషనల్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో ఎనలేని సేవలందించిన 132 మంది ఈ ఏడాదికిగానూ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. మొత్తం 132 అవార్డుల్లో ‘భారత రత్న’ తర్వాత దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ అవార్డుకు ఐదుగురు ఎంపికవ్వగా, 17 మంది ‘పద్మ భూషణ్’కు, 110 మంది ‘పద్మ శ్రీ’ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో 30మంది మహిళలు ఉండగా, ఎన్నారై కేటగిరిలో 8 మంది, మరణానంతరం 9 మందికి ఈ అవార్డులు వరించనున్నాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏటా మార్చి/ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహిస్తారు. అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవికి కళల విభాగంలో ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ప్రజా వ్యవహారాల విభాగంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైనవారిలో చిరంజీవి, వెంకయ్య నాయుడితోపాటు వైజయంతిమాల బాలి(తమిళనాడు), పద్మ సుబ్రమణ్యం(తమిళనాడు), బిందేశ్వర్ పాఠక్(బిహార్- మరణానంతరం) ఉన్నారు. మొత్తం ఐదు పద్మ విభూషణ్‌లలో రెండు ఏపీ ప్రముఖులకు రాగా, రెండు తమిళనాడు, ఒకటి బిహార్‌కు చెందిన వ్యక్తులను వరించాయి. కాగా, చిరంజీవిని 2006లోనే ‘పద్మ భూషణ్’ అవార్డు వరించగా, తాజాగా పద్మ విభూషణ్‌కు సైతం ఎంపికవ్వడం విశేషం.

తెలంగాణలో ఐదుగురికి..

ఈ ఏడాది 17 మంది పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపికవ్వగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారెవరూ లేరు. అయితే, పద్మ శ్రీ పురస్కారానికి 110 మంది ఎంపికవ్వగా, ఇందులో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీ నుంచి ఒకరికి ఈ అవార్డు వరించింది. మొత్తం అవార్డుల్లో రెండు పద్మ విభూషణ్‌లు సహా తెలుగు రాష్ట్రాలకు 8 పురస్కారాలు అందనున్నాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకళావిభాగంలోనే వేలు ఆనందచారి, సాహిత్యంలో కేథావత్ సోమ్‌లాల్, కురెళ్ల విఠలాచార్య, ఏపీ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యారు.

అవార్డుల జాబితా

* పద్మ విభూషణ్(5)

వైజయంతిమాల బాలి (తమిళనాడు), కొణిదెల చిరంజీవి(ఆంధ్రప్రదేశ్), వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం- బిహార్), పద్మా సుబ్రహ్మణ్యం(తమిళనాడు)

పద్మ భూషణ్ (17)

ఎం.ఫాతిమా బీవీ (మరణానంతరం-కేరళ), హోర్ముస్జి ఎన్ కామా(మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి(పశ్చిమ బెంగాల్), సీతారాం జిందాల్(కర్ణాటక), యంగ్ లియు(తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా(మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం- పశ్చిమ బెంగాల్), రామ్ నాయక్(మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్(గుజరాత్), ఒలంచెరి రాజగోపాల్(కేరళ), దత్తాత్రే అంబదాస్ మాయలూ అలియాస్ రాజ్‌దత్(మహారాష్ట్ర), తోగ్డాన్ రింపోచే(మరణానంతరం-లడఖ్), ప్యారేలాల్ శర్మ(మహారాష్ట్ర), చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్(బిహార్), ఉషా ఉతుప్(పశ్చిమ బెంగాల్), విజయకాంత్ (మరణానంతరం-తమిళనాడు), కుందన్ వ్యాస్(మహారాష్ట్ర)

పద్మశ్రీ (110)

ఖలీల్ అహమద్(ఉత్తర ప్రదేశ్), బద్రప్పన్ ఎం(తమిళనాడు), కాలూరాం బమనీయ(మధ్యప్రదేశ్), రెజ్వానా చౌదరి బన్నా(బంగ్లాదేశ్), నసీమ్ బానో(ఉత్తర ప్రదేశ్), రాంలాల్ బరేత్(ఛత్తీస్‌గఢ్), గీతా రాయ్ బర్మన్(పశ్చిమ బెంగాల్), పర్బతి బారుహ్(అసోం), సర్బేశ్వర్ బాసుమతరీ(అసోం), సోమ్ దత్ బట్టు(హిమాచల్ ప్రదేశ్), తక్దీరా బేగం(పశ్చిమ బెంగాల్), సత్యనారాయణ బేలేరి(కేరళ), ద్రోణ భుయాన్(అసోం), అశోక్ కుమార్ బిస్వాస్(బిహార్), రోహన్ బోపన్న(కర్ణాటక), స్మృతి రేఖ చక్మా(త్రిపుర), నారాయణ చక్రవర్తి(పశ్చిమ బెంగాల్), వేలు ఆనందచారి(తెలంగాణ), రామ్ చేత్ చౌదరి(ఉత్తర ప్రదేశ్), కె చెల్లమ్మాళ్(అండమాన్ & నికోబార్ దీవులు), జోష్న చినప్ప(తమిళనాడు), షార్లెట్ చోపిన్(ఫ్రాన్స్), రఘువీర్ చౌదరి(గుజరాత్), జో డి క్రూజ్(తమిళనాడు), గులాం నబీ దార్(జమ్మూ కశ్మీర్), చిత్త రంజన్ దెబ్బర్మ(త్రిపుర), ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే(మహారాష్ట్ర), ప్రేమ ధనరాజ్(కర్ణాటక), రాధా కృష్ణ ధీమాన్(ఉత్తర ప్రదేశ్), మనోహర్ కృష్ణ డోలే(మహారాష్ట్ర), పియర్ సిల్వైన్ ఫిలియోజాట్(ఫ్రాన్స్), మహాబీర్ సింగ్ గుడ్డు(హర్యానా), అనుపమ హోస్కెరే(కర్ణాటక), యాజ్ది మానేక్ష ఇటాలియా(గుజరాత్), రాజారాం జైన్(ఉత్తర ప్రదేశ్), జంకీలాల్(రాజస్థాన్), రతన్ కహర్(పశ్చిమ బెంగాల్), యశ్వంత్ సింగ్ కథోచ్(ఉత్తరాఖండ్), జహీర్ I కాజీ(మహారాష్ట్ర), గౌరవ్ ఖన్నా(ఉత్తర ప్రదేశ్), సురేంద్ర కిషోర్, (బిహార్), దాసరి కొండప్ప(తెలంగాణ), శ్రీధర్ మాకం కృష్ణమూర్తి(కర్ణాటక), యనుంగ్ జమోహ్ లెగో(అరుణాచల్ ప్రదేశ్), జోర్డాన్ లెప్చా(సిక్కిం), సతేంద్ర సింగ్ లోహియా(మధ్యప్రదేశ్), బినోద్ మహారాణా(ఒడిశా), పూర్ణిమ మహతో(జార్ఖండ్), ఉమామహేశ్వరి (ఆంధ్రప్రదేశ్), దుఖు మాఝీ(పశ్చిమ బెంగాల్), రామ్ కుమార్ మల్లిక్(బిహార్), హేమచంద్ మాంఝీ(ఛత్తీస్‌గఢ్), చంద్రశేఖర్ మహదేవరావు మేష్రం(మహారాష్ట్ర), సురేంద్ర మోహన్ మిశ్రా(మరణానంతరం-ఉత్తర ప్రదేశ్), అలీ మహమ్మద్ & శ్రీ ఘనీ మహమ్మద్ (ద్వయం-రాజస్థాన్), కల్పనా మోర్పారియా(మహారాష్ట్ర), చమీ ముర్ము(జార్ఖండ్), శశింద్రన్ ముత్తువేల్(పాపువా న్యూ గినియా), జి నాచియార్(తమిళనాడు), కిరణ్ నాడార్(ఢిల్లీ), పకరావూర్ చిత్రన్ నంబూద్రిపాద్(మరణానంతరం-కేరళ), నారాయణన్(కేరళ), శైలేష్ నాయక్(ఢిల్లీ), హరీష్ నాయక్(మరణానంతరం-గుజరాత్), ఫ్రెడ్ నెగ్రిట్(ఫ్రాన్స్), హరి ఓం(హర్యానా), భగబత్ పధాన్(ఒడిశా), సనాతన్ రుద్ర పాల్(పశ్చిమ బెంగాల్), శంకర్ బాబా పుండ్లిక్రావ్ పాపల్కర్(మహారాష్ట్ర), రాధే శ్యామ్ పరీక్(ఉత్తర ప్రదేశ్), దయాల్ మావ్జీభాయ్ పర్మార్(గుజరాత్), బినోద్ కుమార్ పసాయత్(ఒడిశా), సిల్బి పాసాహ్(మేఘాలయ), శాంతి దేవి పాశ్వాన్ & శ్రీ శివన్ పాశ్వాన్(ద్వయం-బిహార్), సంజయ్ అనంత్ పాటిల్(గోవా), ముని నారాయణ ప్రసాద్(కేరళ), కెఎస్ రాజన్న(కర్ణాటక), చంద్రశేఖర్ చన్నపట్న రాజన్నచార్(కర్ణాటక), భగవతీలాల్ రాజపురోహిత్(మధ్యప్రదేశ్), రోమలో రామ్(జమ్మూ కశ్మీర్), నవజీవన్ రస్తోగి(ఉత్తర ప్రదేశ్), నిర్మల్ రిషి(పంజాబ్), ప్రాణ్ సబర్వాల్(పంజాబ్), గడ్డం సమ్మయ్య(తెలంగాణ), సంగంకిమ(మిజోరం), మచిహన్ సాసా(మణిపూర్), ఓంప్రకాష్ శర్మ(మధ్యప్రదేశ్), ఏకలవ్య శర్మ(పశ్చిమ బెంగాల్), రామ్ చందర్ సిహాగ్(హర్యానా), హర్బిందర్ సింగ్(ఢిల్లీ), గుర్విందర్ సింగ్(హర్యానా), గోదావ‌రి సింగ్(ఉత్తర ప్రదేశ్), రవి ప్రకాష్ సింగ్(మెక్సికో), శేషంపట్టి టి శివలింగం(తమిళనాడు), సోమన్న(కర్ణాటక), కేతావత్ సోమ్‌లాల్(తెలంగాణ), శశి సోని(కర్ణాటక), ఊర్మిళ శ్రీవాస్తవ(ఉత్తర ప్రదేశ్), నేపాల్ చంద్ర సూత్రధార్(మరణానంతరం-పశ్చిమ బెంగాల్), గోపీనాథ్ స్వైన్(ఒడిశా), లక్ష్మణ్ భట్ తైలాంగ్(రాజస్థాన్), మాయా టాండన్(రాజస్థాన్), అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ బాయి తంపురాట్టి(కేరళ), జగదీష్ లభశంకర్ త్రివేది(గుజరాత్), సనో వాముజో(నాగాలాండ్), బాలకృష్ణన్ సదనం పుతియా వీటిల్(కేరళ), కూరెళ్ల విఠలాచార్య(తెలంగాణ), కిరణ్ వ్యాస్(ఫ్రాన్స్), జగేశ్వర్ యాదవ్(ఛత్తీస్‌గఢ్), బాబు రామ్ యాదవ్(ఉత్తర ప్రదేశ్)



Next Story

Most Viewed