Mallikarjuna Kharge ఛాంబర్లో ప్రతిపక్షాల సమావేశం

by Javid Pasha |   (  Updated:2022-12-07 05:48:31  IST  )

పార్లమెంట్ లోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో వారంతా సమావేశమయ్యారు.

Mallikarjuna Kharge  ఛాంబర్లో ప్రతిపక్షాల సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో వారంతా సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై వారంతా చర్చించారు. ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువ పతనం, ఇండో చైనా సరిహద్దు సమస్య, ఎగుమతుల తగ్గుదల, అధిక జీఎస్టీల వంటి అంశాలపై అధికార పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే విషయంపై సమావేశంలో చర్చంచినట్లు సమాచారం. ఇక ఈసారి మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తున్న కేంద్రం.. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.


Also Read...

RBI hikes repo rate by 35 bps

Next Story