పార్లమెంట్‌లో మైక్ కటింగ్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్..

by Disha Web Desk 13 |
పార్లమెంట్‌లో మైక్ కటింగ్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్..
X

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌లో విపక్ష నేతల మైకులు ఆఫ్ చేస్తున్నారనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ప్రధాని మోడీని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం చేయడమే పని అన్నారు. ఎక్కువ మాట్లాడే వ్యక్తి తనను అనుమతిస్తలేరని చెప్పారని విమర్శించారు.

మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివన్ష్ కూడా కాంగ్రెస్ నేతపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా తప్పిదమని, ఆధారరహితమని విమర్శించారు. గత తొమ్మిదేళ్ల తాను పార్లమెంట్ లో ఉన్నానని, ఇప్పటివరకు ఒకసారి ఇలాంటి మాటలు వినలేదని చెప్పారు. లండన్ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో పార్లమెంటులో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వరని అన్నారు.



Next Story

Most Viewed