రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో 'నాగబంధం'.. సీక్వెల్‌పై నిర్మాతలు ఏమన్నారంటే?

by Chukka Sudharani |

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’.

రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో నాగబంధం.. సీక్వెల్‌పై నిర్మాతలు ఏమన్నారంటే?
X

దిశ, సినిమా: విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం జులై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనతో నాగబంధం మొదలైంది. కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నమ్మకం పెరిగింది. నాగబంధం కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాం. విరాట్ కర్ణ, దర్శకుడిగా అభిషేక్ నామా ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ మాకు కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉంది. లార్జర్ దాన్ లైఫ్ మైథాలజికల్ కథతో సినిమా చేయాలనే ఆలోచన మొదటి నుంచే ఉంది. అభిషేక్ నామా గారు ఇంతకుముందు డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఆయన విజన్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఇంత భారీ బడ్జెట్ పెట్టాము. ఫైనల్ అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాం. విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మేము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. మేము ఊహించిన దానికంటే గొప్పగా సినిమా వచ్చింది. నాగబంధం నిజంగా ఒక విజువల్ స్పెక్టాకిల్. ప్రేక్షకులను కచ్చితంగా గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే కచ్చితంగా సీక్వెల్ రూపొందించే ఆలోచన ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

Next Story