ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీకి నోటీసులు!

by Disha Web Desk 12 |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీకి నోటీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ ఛార్జ్ విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు ఉన్న రాజకీయ అనుబంధం కారణంగా ఈ కేసులో తనను బలి పశువును చేస్తున్నారని విజయ్ నాయర్ ఈ సందర్భంగా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లో గానీ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈసీఐఆర్ కు ఎటువంటి అర్హత లేదని అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్ పై తదుపరి విచారణ మే 19 కి వాయిదా వేసింది.



Next Story

Most Viewed