మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు: తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

by Dishanational2 |
మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు: తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ దేశ తూర్పు తీరంలో ఆదివారం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా తెలిపింది. అయితే క్షిపణి ఎంత దూరం వెళ్లింది అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా చేత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉన్నట్టు గుర్తించామని పేర్కొంది. దక్షిణ కొరియాతో ఉద్రిక్త సముద్ర సరిహద్దు సమీపంలో ఉత్తర కొరియా ఫిరంగి షెల్స్‌తో కాల్పులు జరిపిన తర్వాత ఈ ప్రయోగం జరగడం గయనార్హం. కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ మాట్లాడుతూ.. తమ దేశ ఆయుధ సంపత్రిని విస్తరించుకుంటామని, అమెరికా ఎత్తుగడలను ఎదుర్కునేందుకు అదనపు గూఢచార ఉపగ్రహాలను ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరపడం గమనార్హం.


Next Story

Most Viewed