57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్

by Dishanational4 |
57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బిహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. బిహార్‌లోని 8 స్థానాలు, హర్యానాలోని 10, జార్ఖండ్‌లోని 4, ఒడిశాలోని 6, ఉత్తరప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8, ఢిల్లీలోని 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో విడత ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. దేశంలో మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఏడో దశ పోలింగ్‌కు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. చివరిదైన ఏడో దశలో దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీన ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Next Story