లోకో పైలట్ల సమయస్ఫూర్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

by Ramesh Naini |

న్యూఢిల్లీ - డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు తమ విధి నిర్వహణలో ప్రదర్శించిన అత్యంత అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది.

లోకో పైలట్ల సమయస్ఫూర్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూఢిల్లీ - డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు తమ విధి నిర్వహణలో ప్రదర్శించిన అత్యంత అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే పట్టాలు దాటుతున్న అడవి ఏనుగుల మందను సకాలంలో గమనించిన పైలట్లు, చాకచక్యంగా వ్యవహరించి వాటి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రోజు తెల్లవారుజామున 12424 న్యూఢిల్లీ - డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ తితాబర్ - మరియాని స్టేషన్ల మార్గంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ప్రధాన లోకో పైలట్ ఎస్.ఎన్. రాజు, అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్.కె. సింగ్ ట్రాక్ మీదకు వచ్చిన అడవి ఏనుగుల మందను గమనించారు. ప్రమాదాన్ని పసిగట్టిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.

సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు..

దీంతో రైలు ఏనుగుల మందకు సమీపంలోకి వచ్చి సురక్షితంగా ఆగిపోయింది. ఎలాంటి ఆటంకం లేకపోవడంతో ఆ వన్యప్రాణుల మంద క్షేమంగా పట్టాలు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. డ్యూటీలో అత్యంత అప్రమత్తంగా ఉండి, సకాలంలో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి మూగజీవాల ప్రాణాలను, అలాగే రైలుకు జరగాల్సిన ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్లు ఎస్.ఎన్. రాజు, ఆర్.కె. సింగ్‌ల పై రైల్వే అధికారులు, ప్రజల నుంచి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Next Story