- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Corona Virus: దేశంలో కొనసాగుతన్న కరోనా వైరస్
దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. కాగా.. బుధవారం కొత్తగా దాదాపు 300 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో, దేశంలో 4 వేలకు పైగా యాక్టివ్ కేసులు చేరాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. కాగా.. బుధవారం కొత్తగా దాదాపు 300 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో, దేశంలో 4 వేలకు పైగా యాక్టివ్ కేసులు చేరాయి. కేరళలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు కేంద్రమంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, మొత్తం మరణాల సంఖ్య ఏడుకి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry Of India) డేటా ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 276 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,302కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,373 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తర ప్రదేశ్లో 201 కేసులు పాజిటివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో నాలుగు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ (Covid-19)తో మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 3,281 మంది డిశ్చార్జ్ అయ్యారు.






