- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National mourning: దేశవ్యాప్తంగా 7 రోజుల సంతాప దినాలు.. ప్రకటించిన కేంద్రం
by B.Srinivas |
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం నెలకొంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan singh) మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం నెలకొంది. దీంతో దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 7 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. అలాగే శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. అంతేగాక ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన అరుదైన రాజకీయ నాయకులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. ఆయన మరణం దేశానికి తీరనిలోటు’ అని పేర్కొన్నారు.
Next Story






