నా భార్య అనారోగ్యంతో ఉంది, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి: మనీష్ సిసోడియా

by Dishanational1 |
నా భార్య అనారోగ్యంతో ఉంది, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి: మనీష్ సిసోడియా
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యే ముందు ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. 'జైలుకు వెళ్లాలంటే నాకు భయం లేదు. నేను భగత్ సింగ్ అనుచరుడిని. మీరంతా నాకు కుటుంబం లాంటివారు. నాపై వచ్చిన వచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు. నేను అత్యంత నిజాయితీతో పని చేశాను. ఎప్పుడు కూడా కష్టపడి పని చేశాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకోండి' అంటూ ఆయన పేర్కొన్నారని అందులో తెలిపారు.

Next Story

Most Viewed