- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్
ముంబై సహార్ విమానాశ్రయానికి (Mumbai Airport) బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

దిశ, వెబ్డెస్క్: ముంబై సహార్ విమానాశ్రయానికి (Mumbai Airport) బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అజ్ఞాత వ్యక్తి ఇండిగో విమానంలో (IndiGo Plane) బాంబు పెట్టామని, ఆ విమానాన్ని పేల్చివేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో 9 ఉగ్రస్థావరాలను మిస్సైళ్లతో పేల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ మెరుపుదాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయ హాట్లైన్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. భారత్ మెరుపు దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఓపెన్ గా చెప్పగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.
బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం మొత్తం బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని భద్రతా సంస్థలు.. విమానాలు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు.






