ఫడ్నవిస్ మహారాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్

by Dishafeatures2 |
ఫడ్నవిస్ మహారాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఫడ్నవిస్ అధికారం చేపట్టే వరకు మహారాష్ట్ర అన్ని రంగాల్లో ముందుండేదని అన్నారు. ఫడ్నవిస్ హయాంలో అవినీతి గణనీయంగా పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతి నేతలతో నిండిపోయిందన్న ఆయన.. అజిత్ పవార్, ఛగన్ భుజబల్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని సెటైర్లు వేశారు. దీనతంటికీ ఫడ్నవిస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed