మరణశయ్యపై మొజ్తబా ఖమేనీ..! ఇరాన్ రాజకీయాల్లో ముదురుతున్న సంక్షోభం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 06:41:06  IST  )

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడు మొజ్తబా ఖొమేనీ స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

మరణశయ్యపై మొజ్తబా ఖమేనీ..! ఇరాన్ రాజకీయాల్లో ముదురుతున్న సంక్షోభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran) అత్యున్నత నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) కుమారుడు, ఆయన రాజకీయ వారసుడిగా భావిస్తున్న మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) స్పృహ కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం ఇరాన్ అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇరాన్ ఆధ్యాత్మిక నగరమైన ఖుమ్(Qom)లో మొజ్తబా ఖమేనీ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని దౌత్యపరమైన వర్గాలు వెల్లడించాయి. అయితే, అందుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియని అయోమయం నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.

కాగా, ఇటీవలే ఖుమ్ నగరంలో ఇరాన్ ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (Assembly of Experts) అంటే వారసుడిని ఎన్నుకునే అత్యున్నత మండలి సమావేశమైంది. అయితే, ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయని, ఇది ఇరాన్ భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొజ్తబా ఖమేనీ అనారోగ్యంతో ఇరాన్‌లో తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Next Story