ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ.. రోడ్డు షో కోసం పటిష్ట భద్రత

by Disha Web Desk 4 |
ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించిన మోడీ.. రోడ్డు షో కోసం పటిష్ట భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో శివమొగ్గ ఎయిర్ పోర్ట్ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. మోడీ అనంతరం బెలగావిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇందుకు గాను అధికారులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అలోక్ కుమార్ చనమ్మ సర్కిల్‌లో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్డు షో రూట్ లో భారీ సంఖ్యలో పోలీసు ఫోర్స్ లను మోహరించారు.

ఆరుగురు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 28 మంది డీఎస్పీలు, 60 మంది ఇన్స్ పెక్టర్లు, 22 మంది కేఎస్ ఆర్పీ స్కాడ్స్, 3 వేల మంది పోలీసు సిబ్బందిని ఇప్పటికే నియమించారు. మొత్తం 10.7 కిలోమీటర్లు ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుందని అలోక్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed