భారత వాయుసేనలో సరికొత్త చరిత్ర.. యుద్ధ క్షేత్రంలో మహిళ..

by Disha Web Desk 13 |
భారత వాయుసేనలో సరికొత్త చరిత్ర.. యుద్ధ క్షేత్రంలో మహిళ..
X

న్యూఢిల్లీ: వాయుసేనలో సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళ దినోత్సవం నేపథ్యంలో పశ్చిమ సెక్టార్ లో ఫ్రంట్ లైన్ కాంబాట్ బాధ్యతలను కెప్టెన్ షాలిజా ధామి స్వీకరించారు. యుద్ధ క్షేత్రంలో మహిళకు ఈ తరహా బాధ్యతలు అప్పగించడం ఇదే మొదటిసారి. ఈ నెల ప్రారంభంలో సైన్యం వైద్యానికి సంబంధించి కాకుండా ఇతర విధుల్లో కమాండ్ పాత్రలకు మహిళా అధికారులను కేటాయించడం ప్రారంభించింది.

వీరిలో దాదాపు 50 మంది ఫార్వర్డ్‌తో సహా కార్యాచరణ ప్రాంతాల్లో యూనిట్‌లకు అధిపతిగా ఉండనున్నారు. గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా నియమితుడయ్యారు. 2,800 గంటలకు పైగా విమానయాన అనుభవాన్ని కలిగి ఉన్నారు. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఆమె పశ్చిమ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పనిచేశారు.


Next Story

Most Viewed