Breaking News : భారీగా నక్సల్స్ మందుపాతరల వెలికితీత

by Muthe.Rajitha |   (  Updated:2024-11-16 15:54:43  IST  )

మహారాష్ట్ర(Maharashtra)లో పోలీసులు భారీగా నక్సల్స్ మందుపాతరలను(Landmines)ను వెలికితీశారు.

Breaking News : భారీగా నక్సల్స్ మందుపాతరల వెలికితీత
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లో పోలీసులు భారీగా నక్సల్స్ మందుపాతరలను(Landmines)ను వెలికితీశారు. శనివారం గడ్చిరోలి జిల్లాలో ఒక వంతెనపై నక్సల్స్ అమర్చిన మందుపాతరలను తొలగించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. పర్లకోట నదిపై ఉన్న బ్రిడ్జిపై నక్సల్స్ మందుపాతరలు అమర్చినట్టు సమాచారం అందడంతో.. గడ్చిరోలి నుంచి బాంబు డిస్పోజల్ స్వాడ్ హెలికాప్టర్‌లో బయలుదేరి ఆ మందుపాతరలను తొలగించింది. అందులో ఒకటి పేలినప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ బ్రిడ్జి భమ్రగాడ్, టాడ్‌గావ్ గ్రామాలను కలుపుతుంది. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమో అనే అనుమానంతో పోలీసులు సమీప ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కాగా మహారాష్ట్రలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎలెక్షన్స్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకాహారం నిర్వహిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకొని నక్సల్స్ వీటిని అమర్చినట్టు తెలుస్తోంది.


Next Story