ఐపీఎస్ అధికారిణితో రాష్ట్ర మంత్రి వివాహం

by Disha Web Desk 12 |
ఐపీఎస్ అధికారిణితో రాష్ట్ర మంత్రి వివాహం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ జ్యోతి యాదవ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మాన్సాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. గతంలో ఆమె తన నియోజకవర్గమైన లూథియానా సౌత్‌లో తనకు చెప్పకుండా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినందుకు ఆప్ ఎమ్మెల్యే రాజేందర్ పాల్ కౌర్ ఆమెతో వాదించింది. దీంతో ఆ వార్త వైరల్‌గా మారింది. కాగా ఈ ఆపరేషన్‌కు పోలీసు కమిషనర్ ఆమోదం తెలిపారని యాదవ్ కౌర్‌కు తెలియజేశారు. ప్రస్తుతం వీరికి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed