- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists: మావోయిస్టులకు భారీ షాక్.. సుక్మా జిల్లాలో 23 మంది సరెండర్
ఛత్తీస్గఢ్లో మరో 23 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. సుక్మా జిల్లాలో లొంగిపోయినట్టు బస్తర్ రేంజ్ పోలీసు ఉన్నతాధికారి సుందర్ రాజ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్గఢ్ (Chattisgarh) లో మరో 23 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. సుక్మా జిల్లా (Sukhma distric) లో భద్రతా బలగాల ఎదుట లొంగిపోయినట్టు బస్తర్ రేంజ్ పోలీసు ఉన్నతాధికారి సుందర్ రాజ్ (Sunder raj) తెలిపారు. వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లపై మొత్తం రూ.1 కోటి 18 లక్షల రివార్డు ఉంది. అందులో 11 మంది సీనియర్ మావోయిస్టులు సైతం ఉన్నారు. వీరందరూ సీపీఐ మావోయిస్టు అనుబంధ సంఘాలైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్సీ), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వంటి క్రియాశీల సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అంతేగాక ఆ బృందంలో 2012లో సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ను అపహరణలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం భీమా అలియాస్ లోకేష్ కూడా ఉన్నారు. కాగా, అంతకుముందు రోజు నారాయణపూర్ (Narayanapur) జిల్లాలో 22 మంది నక్సలైట్లు సరెండర్ అయిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తాకినట్టు అయింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 427 మంది నక్సలైట్లు హతం కాగా, గత ఏడాదిన్నరగా 1,428 మంది నక్సలైట్లు లొంగిపోయారు.






