మావోయిస్టుల స్మారక స్థూపం కూల్చివేత

by Disha Web Desk 14 |
మావోయిస్టుల స్మారక స్థూపం కూల్చివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నారాయణపూర్‌, కస్తూర్‌మెటాలోని ఇక్‌పాడ్ ప్రాంతంలో 53వ బెటాలియన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నక్సల్ స్మారకాన్ని ధ్వంసం చేసింది.

కాగా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తాజాగా తెలంగాణ, చత్తీస్‌‌గఢ్ సరిహద్దులో భద్రాతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే సుక్మా, బీజాపూర్ జిల్లాలో 12 మంది నక్సలైట్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story