ఢిల్లీ కోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్

by Dishafeatures2 |
ఢిల్లీ కోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేడు ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ కస్టడీ ముగియడానికి ఒకరోజు ముందు సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించిన కేసులో గత నెల 26న సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్‌ చేశారు.

అయితే, కస్టడీలోకి తీసుకున్న అధికారులకు సిసోడియా విచారణకు సహకరించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, మనీష్ సిసోడియా అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా ఆప్‌ నేతలు నిరసనలకు దిగారు. అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి సిసోడియాను అరెస్ట్‌ చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story