- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మరి కాసేపట్లో కోర్టుకు మనీష్ సిసోడియా
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియాను మరికాసేపట్లో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సిసోడియా నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అరెస్టుకు ముందు మూడు రోజుల పాటు జైలులో విచారించిన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంపై మరింత ఆరా తీయబోతున్నారు. ఈ మేరకు కస్టడీని కోరే అవకాశం ఉంది. మరో వైపు సీబీఐ కేసులో సిసోడియా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కవితను ప్రశ్నించేందుకు ముందు సిసోడియాను ఈడీ అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.