Mandsaur Accident : మాండ్సౌర్ రోడ్డు ప్రమాదం... 11 కు చేరిన మృతులు

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్(Mandsaur Accident) జిల్లాలో ఆదివారం ఓ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన సంఘటన తెలిసిందే.

Mandsaur Accident : మాండ్సౌర్ రోడ్డు ప్రమాదం... 11 కు చేరిన మృతులు
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్(Mandsaur Accident) జిల్లాలో ఆదివారం ఓ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన సంఘటన తెలిసిందే. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. మధ్యప్రదేశ్‌(MP)లోని మండ్సౌర్ జిల్లాలో కచారియా గ్రామంలో నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. 13 ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ తో ముందు ఓ బైక్ ను ఢీకొట్టి.. అనంతరం పక్కనే ఉన్న ఓ పాడిబడిన బావిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలియజేశారు. మృతుల్లో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి, కారులోని 9 మందితోపాటు.. సహాయక చర్యల కోసం వచ్చిన గ్రామస్థుడు కూడా మరణించడం అక్కడి వారిని కలచి వేసింది. దాదాపు 5 గంటలపాటు కష్టపడి బావిలోనుంచి వ్యాన్ ను బయటికి తీసాయి రెస్క్యూ బృందాలు.

తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఆ పాడుబడిన బావిలో విషవాయువులు ఉండటం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళిన ఆయన.. సహాయక చర్యలపై, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.

Next Story