- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజి.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యుల వ్యతిరేకతను అధిగమించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని చివరికి తల్లే మట్టుబెట్టింది.

దిశ, వెబ్డెస్క్: కుటుంబ సభ్యుల వ్యతిరేకతను అధిగమించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని చివరికి తల్లే మట్టుబెట్టింది. భార్యతో కలిసి ఇంటికి వచ్చిన అతడిపై తల్లి, తోబుట్టువులు కలిసి దాడి చేసి హత్య చేయడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ దాడిలో అతని భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అమిత్ అనే 30 ఏళ్ల యువకుడు 2022లో ఓ ఆర్కెస్ట్రా డ్యాన్సర్ అనితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి మీరా దేవి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దంపతులు ఢిల్లీకి వెళ్లి నివాసం ఉంటున్నారు.
రెండు సంవత్సరాల తర్వాత బుధవారం సాయంత్రం అమిత్ తన భార్యతో కలిసి స్వగ్రామంలో ఉన్న ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు తల్లి, సోదరులు వారిని అడ్డుకున్నారు. వాగ్వాదం దాడిగా మారి, కర్రలు, రాడ్లతో అమిత్పై దాడి చేశారు.
తీవ్ర గాయాల కారణంగా అమిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని భార్య అనిత రక్షించబోయి దాడికి గురైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అమిత్ మృతి చెందాడు. అనితను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి, తల్లి మీరా దేవి సహా నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబంలోనే ఇలా దారుణం జరగడం ఊరంతా విషాదంలో ముంచెత్తింది.






