అందరూ ఆయుధాలు వదిలి లొంగిపోండి.. మావోయిస్టులకు మల్లోజుల సంచలన పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-01 17:24:52  IST  )

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజు వేణుగోపాల్(Mallujola Venugopal) సంచలన వీడియో విడుదల చేశారు.

అందరూ ఆయుధాలు వదిలి లొంగిపోండి.. మావోయిస్టులకు మల్లోజుల సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజు వేణుగోపాల్(Mallujola Venugopal) సంచలన వీడియో విడుదల చేశారు. విప్లవానికి సేవ చేయాలని ఉన్న మావోయిస్టు(Maoist Party)లు అందరూ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శనివారం మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ వీడియో రిలీజ్ చేశారు.

‘అందరికీ నమస్కారం.. సెప్టెంబర్ 16న, మొదటిసారిగా, సాయుధ పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ నేను ఒక ప్రకటన విడుదల చేశాను. ఆ తర్వాత, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో, గత బస్తర్ నుండి వచ్చిన సహచరులు కూడా అక్కడి నుండి ప్రకటనలు విడుదల చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో, నాతో పాటు 60 మంది సహచరులు ఆయుధాలను వదిలిపెట్టారు. ప్రధానంగా, ఆదివాసీ శ్రేయోభిలాషులు మేము తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుని దానికి మద్దతు ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఆయుధాలు వదులుకున్న వారు మరియు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నవారు, ప్రజల మధ్య పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు మీరు నన్ను సంప్రదించవచ్చు(85603853).

అయితే, మా కేంద్ర కమిటీ (CC) ఈ మార్పులన్నింటినీ గుర్తిస్తోంది. కానీ వారు పోరాట పంథాను మార్చుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. కాబట్టి, దేశంలోని ప్రతి మూలలో పనిచేస్తున్న మా సహచరులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.. మీరందరూ మీ ఆయుధాలను విడిచిపెట్టి సాయుధ పోరాటాన్ని ముగించండి.. ఆయుధాలు వదిలివేయాలి, ప్రజల మధ్యకు రావాలి.. సాయుధ పోరాటంతో మన లక్ష్యాలను సాధించలేం.. ఈ విషయాన్ని కామ్రేడ్‌లందరూ అర్థం చేసుకోవాలి. మనం ప్రజల మధ్య పోరాటం చేయాల్సిన సమయం.. ఈ సోషల్ మీడియా యుగాన్ని యచేసి అర్థం చేసుకోండి’ అని మల్లోజుల వేణుగోపాల్ సంచలన ప్రకటన విడుదల చేశారు. మల్లోజుల వీడియో

Next Story