మిత్సతోమ్‌ 2025.. నదిలో కూలిన పోలీస్ హెలికాప్టర్

by Naga Rani Yarlagadda |

మలేషియాలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోవడం కలకలం రేపింది.

మిత్సతోమ్‌ 2025.. నదిలో కూలిన పోలీస్ హెలికాప్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియాలో ఓ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కూలిపోవడం కలకలం రేపింది. జోహోర్‌ రాష్ట్రంలోని పులాయ్‌ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ సందర్భంగా జరిగినట్లు మలేషియా పౌరవిమానయాన శాఖ పేర్కొంది. ‘మిత్సతోమ్‌ 2025’ పేరిట మలేషియాతో కలిసి సింగపూర్‌, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌లు నిర్వహించిన బహుళ దేశాల అణు భద్రతా కసరత్తులో ఈ హెలికాప్టర్‌ భాగంగా పాల్గొంది.

ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్‌లోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్‌బస్‌ AS355N హెలికాప్టర్‌, గెలాంగ్‌ పాటాలో ఉన్న మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించి పైలట్‌తో పాటు ఐదుగురిని బయటకు తీశాయి. గాయపడిన వారిలో ఇద్దరు సీనియర్ పోలీస్‌ అధికారులు ఉన్నారు. అయితే వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story